జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ _ తాపీ ధర్మారావు

leave a comment »

నేను పుస్తకం చూడగానే కధ ఏమైనా అయిఉంటుంది అని అనుకున్నాను , కాని రచయిత తాపీ ధర్మారావు పేరు చూడగానె చదవాల్సిన పుస్తకమే అని తీసుకున్నాను.
పుస్తకం మొత్తం మూడు రొజుల్లొ చదివాని రాత్రి పదుకునే ముందు , ఉదయం లేవగానే ఇలా … ఇలా చదవటం వల్లనే ఏమొ వంటబట్టినట్టుంది ;) .
నిజానికి సమాజంలొ బిచ్చగాళ్ళ మీద ఉన్న అభిప్రాయాని వళ్ళు పడే బాదలని , క్షొబని మరియూ నేపద్యాన్ని చాలా దగ్గర గా చూసి రాశారు.
దీనిలొ అడుక్కునేవాళ్ల గురించి , దానం చేసేవాళ్ళ గురించి మానసిక వ్యధతొ రచయిత రాసిన వ్యాసం.
లేని వాడే అడుక్కుంటున్నాడని వాళ్ళనే సమాజం బిచ్ఛగాళ్ళు గా చులకన గా  చూస్తొందని వాళ్ళు అలా తయారు కావడానికి  సమాజమే కారణమని కాని సమాజమే వాళ్ళని ఆదరించకుండ చీదరించుకుంటుందని రచయిత అబిప్రాయ పడ్డారు .
ఇక్కడ రచయిత సమాజంలొ కొన్ని వర్గాల్ని (దానాలు పుచ్ఛుకునేవాళ్ళని ) అడుక్కొవటానికి దానం అనే అందమైన పేరు పెట్టి లాబపడుతున్నారు , దానం ఇచ్చేవాళ్ళూ వాళ్ళకే దానం ఇవ్వడం వళ్ళ పాపాలు తొలగి పొతాయని , ఏదొ ఓరుగుతుందని అనుకుంటారని అన్నారు. దానాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నవాళ్ళకే ఇస్తారు కాని లేని వాడికి ఎవరు ఇవ్వరు .
సమాజంలొ మనం ‘కర్మ’ అనే  ఒక అందమైన దాన్ని శ్రుష్టించుకొని ప్రతిదానికి దాని మీదకే నెట్టివేస్తున్నాం అని వివరించారు , నాకు నచ్చిన వాటిల్లొ  ఇది ఒకటి !!
అడుక్కునే వాడు అలా అడుక్కొవడానికి ఎంతొ మానసిక క్షొభానుబవిస్తాడని ,ఆత్మగొరవం చంపుకొటాడని వేరే దారిలేక దయగల వారిని బిక్ష అడుగుతాడని బిచ్చగాళ్ళ  అంతరంగాన్ని దీనంగా వివరించారు. కాని ఈరొజుల్లొ ఉన్న బిచ్చగాళ్ళలొ ఇలా ఎంతమంది ఉన్నారన్నది నాకు అనుమానం ?
ఈ పుస్తకంలొ ఒక దగ్గర అవయువాలన్ని సరీగ ఉన్నవాడికి దానం చేయవద్దని కూడా అన్నారు !
రచయిత చివరిలొ కొన్ని నిజజీవితాలను వారి నేపద్యాన్ని పరిచయం చేశారు , ఇది నాకు నచ్చింది .

ఏది ఎమైనా నాకు ఈ పుస్తకం చదవదగ్గదని అనిపించింది , బిచ్చగాళ్ళ  విషయంలొ తప్పకుండా మనకు ఒక విదమైన అవగాహన కలుగుతుంది .

Written by కట్టా విజయ్

డిసెంబరు 23, 2011 at 3:10 అపరాహ్నం

SRI KRISHNA COMMITTEE – (TELUGU VERSION)

ఒక వ్యాఖ్యతో

http://www.aponline.gov.in/APPORTAL/Committee.aspx

Written by కట్టా విజయ్

సెప్టెంబరు 30, 2011 at 3:58 అపరాహ్నం

తెలంగాణ లో రాసారు

‘అనంతం’ చదివా !

leave a comment »

అవును నీను అనంతం చదివాను , శ్రీశ్రీ  రాసిన అనంతం , చదువుతున్నంతసేపు అనంతం కుడా అనంతంలానే అనిపించింది . మొత్తానికి చాలా రొజుల తరువాత ఒక పుస్తకాన్ని మొత్తం చదివాను , నేను చివరిసారిగా మొత్తంగా చదివిన పుస్తకం నాయకురాలు నాగమ్మ .

యాద్రుచ్చికంగా ఇలా ఎందుకు జరుగుతుందొ నాకు అర్దం కాదు గాని  నాకు బాగా గుర్తు నేను నవొదయ పాఠశాలలొ చేరినతరువాత (పుస్తకాలు నేను బాగా చదివింది ఇక్కడే) మొదటగా తీసుకున్న పుస్తకం ‘మహాప్రస్థానం’ ,అప్పటికి నాకు శ్రీశ్రీ పేరె తెలుసుకాని ఇంకా ఏమి తెలెదు ! మహాప్రస్థానం కుడా పుస్తకంపేరు , శ్రీశ్రీ అనే పేరు చుసి తీసుకున్నాను తరువాతా మనం పెద్ద ఫ్యాన్ అనుకొడి , తరువాత మొదటగా బ్లాగింది శ్రీశ్రీ కవితనే  మళ్లీ ఇన్నాళ్లకు  ‘అనంతం’ తొ చదవటం మొదలెట్టాను .

అసలు విష్యానికొస్తే ఆదివారం లైబ్రరీలొ అరువు తీసుకున్న పుస్తకం ‘అనంతం’  , ఈ పుస్తకాన్ని ఇది వరకే ఒకసారి చదువుదామనుకున్నాను నా దురద్రుస్టం దాన్ని నదగ్గరనుంచి ఎవరొ దొంగిలించారు :(   అలా ఆగిన నా అనంత శొధన మళ్ళీ ఆపుస్తకం కనిపించడంతొ మొదలైంది , ఇంట్లొ కాలీ దొరికినప్పుడల్లా చదివాను అసలు సొమవారానికె ముగిద్దామని అనుకున్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు .మొత్తానికి ఈ ఉదయం పూర్తి చేశాను , చదివిన తరువాత ఏదొ విజమం సాదించినవాడిలాగా విజయ గర్వంతొ ఊగిపొయాను , మొత్తాని ఏదొ తెలియని ఫీలింగ్ , నాకు శ్రీశ్రీ కి ఆలొచనా ధొరణిలొ   కొన్ని సరిపొయాయని నాఫీలింగ్  అందుకేనేమొ ;) .

ఈ ‘అనంతం’ లొ నాకు శ్రీశ్రీ కి నాకు తెలిసిన వారు ఉన్నారు (నాకు వాళ్ళతొ  పరిచయం లేదు అనుకొండి !!) వాళ్లు ‘వరవరావు ‘ ,’రంగనాయకమ్మ ‘ మరియు మా నియౌజకవర్గ మాజీ యం.యెల్.ఏ ,మాజీ ముఖ్యమంత్రి వెంగళరావు.

ఈ ‘అనంతం’ చదువుతున్నంతసేపు నాకు ఎక్కడ శ్రీశ్రీ అబద్దం చెప్పరని అనిపించలేదు !!
కాని అనంతాన్ని  నవల అన్నారు , శ్రీశ్రీ నే నవల అంటే కల్పిత కధ అని , ఎంత అందంగా అబద్దం చెప్తే అంతగొప్ప రచయిత అని అన్నారు  కాని తన అనంతాన్ని నవల అని ఏందుకన్నారొ  నాకు గొచరించలేదు .

Written by కట్టా విజయ్

సెప్టెంబరు 27, 2011 at 11:44 పూర్వాహ్నం

తెలంగాణ ఏందుకు కావాలి ? నాకు ఎవరైనా వివరించండి

58 వ్యాఖ్యలతో

నాకు జనాలు  తెలంగాణ ఎందుకు కావాలనుకు కావాలొ వివరిస్తారా ! సొది చెప్పకుండా  అంటే  …

1.మనం వెనక బడ్డాం  కాబట్టి

2.మాతెలంగాణ మాకు కావాలి

3. మీము మీతొ కలిసి ఊండం

4.మావనరులు మాకే

ఇలాంటి సొల్లు కాకుండా , శాస్త్రీయంగా ఎవరైనా వివరిస్తారేమొనని చుస్తున్నా.

తెలంగాణా వాళ్ళే చెప్పాలని ఏంలేదు … ఆంద్రాలొను తెలంగాణా కు మద్దతుతెలిపే వారెవరైనా చెప్పొచ్చు. నాకు నిజంగా తెలంగాణా ఎందుకు కావాలొ తెలియడంలేదు … ఒక తెలంగాణా వాడినై ఊండి విచారం వ్యక్తం చేస్తునాను .

Written by కట్టా విజయ్

సెప్టెంబరు 26, 2011 at 2:52 అపరాహ్నం

వికల దృశ్యంలో సకల సమ్మె

2 వ్యాఖ్యలతో

ఇప్పుడు కూడా ప్రాంతాల వారీగా వీరంగం తొక్కుతున్న వారిలో కాంగ్రెస్‌ నేతలే ముందుండటం గమనించదగ్గ విషయం. తెలుగు దేశం నేతలు తర్వాత స్థానం ఆక్రమిస్తున్నారు. ఇక బిజెపి అధికారికంగానే ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. ఇవన్నీ జాతీయ, రాష్ట్ర పార్టీలనుకుంటే ఒక ఉప ప్రాంతానికే పరిమితమైన టిఆర్‌ఎస్‌ కూడా వ్యూహపరమైన వైరుధ్యాలనే ప్రతిబింబిస్తున్నది. లాబీయింగు ద్వారా లక్ష్య సాధన చేస్తామన్న ఆ పార్టీనేత అనేక సార్లు గడువులు ప్రకటించి దెబ్బతిన్నారు. ____తెలకపల్లి రవి

http://www.prajasakti.com/todaysessay/article-274671

Written by కట్టా విజయ్

సెప్టెంబరు 26, 2011 at 12:07 అపరాహ్నం

బ్లాగ్ రొల్ లో రాసారు

Tagged with

నాకు తెలంగాణా వద్దు సమైఖ్యాంద్రే ముద్దు !

28 వ్యాఖ్యలతో

ప్రాంతీయంగా తెలంగాణా వాడి నైనా … నాకు ప్రత్యేక తెలంగాణా ఇష్టంలేదు .

Written by కట్టా విజయ్

సెప్టెంబరు 25, 2011 at 12:23 అపరాహ్నం

తెలంగాణ లో రాసారు